పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రె్‌సవేపై ఇన్నోవా బోల్తా

ABN , First Publish Date - 2020-09-21T07:47:36+05:30 IST

పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే పై అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగు యువకులు

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రె్‌సవేపై ఇన్నోవా బోల్తా

వేగంగా వెళ్తూ..: ఐదుగురికి గాయాలు


రాజేంద్రనగర్‌, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌ప్రెస్‌ వే పై అతివేగంగా వెళ్తున్న ఇన్నోవా బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగు యువకులు గాయపడ్డారు. ఫలక్‌నుమా ముస్తాఫానగర్‌ ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ మహ్మద్‌ ఫరాజ్‌(18), ఆజామ్‌ఖాన్‌(18), మహ్మద్‌ ఫరాన్‌(19), మహ్మద్‌ తఖీ(19), షేక్‌ అబ్దుల్లా(21) ఇన్నోవాలో మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌ వైపు వెళ్తున్నారు. అతివేగంగా వెళ్తుండడంతో పిల్లర్‌ నంబర్‌ 156 వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ లవకుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బోల్తాపడిన ఇన్నోవాను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. 


విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు 

మైలార్‌దేవ్‌పల్లి నల్లపోచమ్మ దేవాలయం వద్ద అతి వేగంగా వెళ్తున్న కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి స్వల్పంగా గాయపడినట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ లవకుమార్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-09-21T07:47:36+05:30 IST