దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి

ABN , First Publish Date - 2020-07-14T10:23:41+05:30 IST

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భోలక్‌పూర్‌

దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి

 పద్మశాలీ కాలనీలో కరోనా కట్టడికి వినూత్న ప్రయత్నం


ముషీరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భోలక్‌పూర్‌ పద్మశాలీ కాలనీకి చెందిన బీహెచ్‌ఎల్‌కంపెనీ రిటైర్డ్‌డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌. ఆంజనేయులు వినూత్న ఆలోచనతో.. ‘దయచేసి మా ఇంటికి రాకండి.. మీరు మీ ఇంటికి రానివ్వకండి’.. కరోనాను కలిసి కట్టుగా నివారిద్దాం.. అంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కాలనీలో కరోనాను అరికట్టేందుకు తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. 

Updated Date - 2020-07-14T10:23:41+05:30 IST