రెవెన్యూ అధికారుల తీరుపై వినూత్న నిరసన
ABN , First Publish Date - 2022-01-23T03:35:19+05:30 IST
తాండూర్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓ యువకుడు శనివారం వినూత్న నిరసన చేపట్టాడు. మం డల కేంద్రానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ తనకు జరుగుతున్న అన్యా యాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చేందుకు పాద యాత్ర చేపట్టాడు.
తాండూర్/బెల్లంపల్లి, జనవరి 22: తాండూర్ మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఓ యువకుడు శనివారం వినూత్న నిరసన చేపట్టాడు. మం డల కేంద్రానికి చెందిన తౌటం రాజేంద్రప్రసాద్ తనకు జరుగుతున్న అన్యా యాన్ని ప్రభుత్వం, ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చేందుకు పాద యాత్ర చేపట్టాడు. తన భూమి రికా ర్డులను తనకు తెలియకుండా మార్చ డంతోపాటు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నాడు. తాండూర్ తహసీల్దార్ కార్యాలయం డప్పు చప్పుళ్ళ తో బెల్లంపల్లి వరకు 9 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. తాండూర్ శివారులోని 612/అ/5లో ఉన్న 3.16ఎకరాల భూమిని రికార్డుల ప్రక్షాళన సమయంలో తనకు తెలియకుండా మార్పు చేసి పార్ట్ బీ నిలిపివేశారని తెలి పారు. 4 సంవత్సరాల నుంచి కలెక్టర్, ఆర్డీవో, తహ సీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అధికా రుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తానని ఆర్డీవో శ్యామలదేవి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించాడు.