న్యాయ శాఖ ఉద్యోగులు వినూత్న నిరసన
ABN , First Publish Date - 2022-01-29T06:11:17+05:30 IST
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎలమంచిలిలో న్యాయ శాఖ ఉద్యోగులు శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. కోర్టు సమీపంలో మోకాళ్లపై నిల్చొని ప్రభుత్వ తీరుపై నినాదాలు చేశారు.
పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు
ఎలమంచిలి, జనవరి 28: పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎలమంచిలిలో న్యాయ శాఖ ఉద్యోగులు శుక్రవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. కోర్టు సమీపంలో మోకాళ్లపై నిల్చొని ప్రభుత్వ తీరుపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్.శ్రీనివాసరావు, డి.ఎ.ఆర్.స్వామి మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ, సీసీఏలను పాత శ్లాబ్లోనే కొనసాగించాలని, మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగమణి, సాయి, రమణ, నాగకుమార్, సంతోశ్, శేఖర్, మీరా పాల్గొన్నారు. ఇదిలావుంటే, పాత పీఆర్సీ ప్రకారం జనవరి నెల వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యా యుడు బి.వి.ఎస్.సాయిబాబాకు తోటి ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. కొత్త పీఆర్సీ వేతనాలు వద్దని అందులో పేర్కొన్నారు.