గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరణపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-09-05T00:54:26+05:30 IST
గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరించుకునే అంశంపై మరోసారి హైకోర్టులో
అమరావతి: గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరించుకునే అంశంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన చంద్రవరపు రవి వేసిన వ్యాజ్యంలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరించే చట్టం లేదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. అనుబంధ పిటిషన్తో కలిపి పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 15కి విచారణను కోర్టు వాయిదా వేసింది.