రైతు మరణంపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2021-12-22T22:10:57+05:30 IST
రైతు భూమ్ బొయి మరణంపై హైకోర్టులో
హైదరాబాద్: రైతు భూమ్ బొయి మరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. కామారెడ్డి జిల్లా శాంతాపూర్లో పోలీసులు కొట్టడం వల్లే రైతు భూమ్ చనిపోయాడని హైకోర్టును మృతుడి కుటుంబసభ్యులు ఆశ్రయించారు. భూమ్ బొయికి అందించిన చికిత్సకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అందించారు. అయితే మెడికల్ టెర్మినాలజీలో రూపంలో ఉన్న నివేదికను సూపరింటెండెంట్ అందజేశారు. దీంతో తమకు అర్థమయ్యే రీతిలో పూర్తి నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.