రైస్‌మిల్లులను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

ABN , First Publish Date - 2021-05-08T04:54:17+05:30 IST

కల్లూరు పట్టణంలోని పలు రైస్‌మిల్లులను శుక్రవారం జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు.

రైస్‌మిల్లులను తనిఖీ చేసిన జిల్లా అధికారులు
కల్లూరులో రైస్‌మిల్లును తనిఖీ చేస్తున్న జిల్లా అధికారుల బృందం

కల్లూరు, మే 7: కల్లూరు పట్టణంలోని పలు రైస్‌మిల్లులను శుక్రవారం జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిటీ సభ్యుల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారి కె.నాగరాజు, మార్కెటింగ్‌ డీఎం సునీత, సీడ్‌ మేనేజర్‌ రాజీవ్‌ తదితరులు సందర్శించారు. ఈ యాసంగిలో దిగుబడి అయిన ధాన్యం ఒక క్వింటా మరపడితే బియ్యం దిగుబడి ఎంత వస్తుందనే కోణంపై వారు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రైస్‌మిల్లుల్లో బియ్యం దిగుబడి రావడం లేదనే నెపంతో యాసంగి ధాన్యం కొనుగోలు చేయకపోవడంపై ఫిర్యాదులు అందడంతో వారు ఈ తనిఖీలు చేశారు. కార్యక్రమంలో క్వాలిటీకంట్రోల్‌ సివిల్‌సప్లయి మేనేజర్‌ రామచంద్రయ్య, ఏవో ఎం.రూప, ఏఈవోలు కేవీ.రమణ, ఎం.పవన్‌కల్యాణ్‌, రైస్‌మిల్లుల యాజమాన్యాలు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T04:54:17+05:30 IST