వాహనాల తనిఖీ
ABN , First Publish Date - 2021-06-14T05:14:24+05:30 IST
రాజంపేట ఆర్టీసీ బస్టాండు వద్ద మన్నూరు సీఐ నరేందర్రెడ్డి, ఎస్ఐ రోషన్ ఆధ్వర్యంలో వాహనాలను పెద్ద ఎత్తున తనిఖీ చేశారు.
రాజంపేట, జూన్13 : రాజంపేట ఆర్టీసీ బస్టాండు వద్ద మన్నూరు సీఐ నరేందర్రెడ్డి, ఎస్ఐ రోషన్ ఆధ్వర్యంలో వాహనాలను పెద్ద ఎత్తున తనిఖీ చేశారు. కర్ఫ్యూ సమయంలో కాకుండా మధ్యాహ్నం 2గంటల పైబడి సాయంత్రం వరకు విచ్చలవిడిగా తిరుగుతున్న వాహనాదారులను పట్టుకొని వారికి అపరాధరుసుము విధించారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలో కూడా విచ్చలవిడిగా తిరుగుతున్న ద్విచక్రవాహనాదారులు, కార్లు, మినీ ట్యాక్సీలు ఇతర వాహనాలపై వెళ్లే వారిని తనిఖీ చేసి వారికి అపరాధరుసుము వేశారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలు మాట్లాడుతూ కర్ఫ్యూ సమయంలో వాహనాలు తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.