రేషన్దుకాణాల్లో పౌరసరఫరాల అధికారి తనిఖీ
ABN , First Publish Date - 2020-07-12T09:44:37+05:30 IST
ఖమ్మం నగరంలో శనివారం రేషన్దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో
ఖమ్మం కలెక్టరేట్, జూలై 11: ఖమ్మం నగరంలో శనివారం రేషన్దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆర్డీవో రవీంద్రనాథ్కు యువతెలంగాణ పార్టీ ఇచ్చిన పిర్యాదు మేరకు ఆర్డీవో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశాలుజారీ చేశారు. ఈనేపథ్యంలో నగరంలోని మామిళ్లగూడెం లోని 35వ నెంబర్ దుకాణంలో తనిఖీ చేశారు. స్టాకు, రిజిస్టర్లను పరిశీలించారు. మొత్తం స్టాక్, మిగిలిన స్టాక్ పరిస్థితిని పరిశీలించారు. అనంతరం బియ్యం,కందిపప్పు, పంచదార సక్రమంగా ఇస్తున్నారా లేదా అని వినియోగదారులను అడిగితెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్భన్ ఆర్ఐ రాజేష్, రవి తదితరులు పాల్గొన్నారు.