కరోనా నివారణ చర్యలు ముమ్మరం చేయండి
ABN , First Publish Date - 2021-04-21T05:12:10+05:30 IST
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశించారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
చేర్యాల, ఏప్రిల్ 20: కరోనా వ్యాప్తి నివారణ చర్యలు ముమ్మరం చేయాలని ప్రజాప్రతినిధులను, అధికారులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశించారు. మంగళవారం చేర్యాల మునిసిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డితో ఆయన ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. మునిసిపాలిటీ పరిఽధిలోని ప్రతీ వీధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు.