‘కావాలనే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు’
ABN , First Publish Date - 2021-10-22T06:28:19+05:30 IST
సీఎం జగన్మోహన్రెడ్డిపై కావాలనే చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఎమ్మె ల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ ఆరోపించారు.
నర్సీపట్నం, అక్టోబరు 21 : సీఎం జగన్మోహన్రెడ్డిపై కావాలనే చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఎమ్మె ల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ ఆరోపించారు. గురువారం ఇక్కడి అబీద్ సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అలజడులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్న కుట్రతో పట్టాభితో ముఖ్యమంత్రిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. వీటిని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో పట్టాభిపై ఫిర్యాదు చేశారు. అంతకుముందు పెదబొడ్డేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అబీద్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీబీ చైర్పర్సన్ అనిత, మునిసిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, వైస్ చైర్మన్లు గొలుసు నర్సింహమూర్తి, తమరాన అప్పలనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కరనాయుడు, నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, కోనేటి రామకృష్ణ పాల్గొన్నారు.