హైదరాబాద్: సెప్టెంబర్ 28 నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం.. ఏపీకి..

ABN , First Publish Date - 2020-09-27T02:02:21+05:30 IST

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి నిలిచిపోయిన అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఎట్టకేలకు...

హైదరాబాద్: సెప్టెంబర్ 28 నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం.. ఏపీకి..

హైదరాబాద్‌: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ నుంచి నిలిచిపోయిన అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఎట్టకేలకు తిరిగి మొదలు కానున్నాయి. ఈ నెల 28(సోమవారం) నుంచి అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రకు బస్సు సర్వీసులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి ఎల్లుండి ఉదయం నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపనున్నారు. ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ తర్వాత ఏపీ, తెలంగాణ సర్వీసులపై నిర్ణయం వెలువడనుంది. ముంబై, పుణె, గుల్బర్గా, నాందేడ్, బీదర్ మార్గాల్లో తొలుత సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కర్ణాటకలో బెంగళూరు మినహా మిగతా ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనున్నారు.

Updated Date - 2020-09-27T02:02:21+05:30 IST