సీఎంఆర్‌లో అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ టోర్నీ

ABN , First Publish Date - 2021-10-24T04:49:10+05:30 IST

సీఎంఆర్‌లో అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ టోర్నీ

సీఎంఆర్‌లో అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ టోర్నీ
విజేత ఈఈఈ జట్టు

మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయ పరిధిలో గల సీఎంఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో నిర్వహించిన అంతర్‌ కళాశాలల బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ శనివారం ముగిసింది. ఇన్‌చార్జి ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ దేవదాస్‌, అడ్మిన్‌ శ్రీనివా్‌సరెడ్డి, సీఎంఆర్‌ కళాశాలల కార్యదర్శి గోపాల్‌రెడ్డిలు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. రెండు రోజులపాటు నిర్వహించిన  టోర్నమెంటులో మొత్తం 12 జట్లు పాల్గొనగా ఈఈఈ జట్టు విజేతగా నిలిచింది. టోర్నమెంట్‌ కన్వీనర్‌ సయ్యద్‌ రఫీక్‌, రోహిణీరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T04:49:10+05:30 IST