ఆధునిక సాహిత్యంపై ఆసక్తి పెరగాలి
ABN , First Publish Date - 2020-08-05T10:42:53+05:30 IST
ఆధునిక సాహిత్యంపై ఆసక్తి పెరగాలని తూర్పు గోదావరి జిల్లా పెరుమాళ్లపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు తలకోటి పృథ్వీరాజ్ ..
ఎచ్చెర్ల: ఆధునిక సాహిత్యంపై ఆసక్తి పెరగాలని తూర్పు గోదావరి జిల్లా పెరుమాళ్లపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు తలకోటి పృథ్వీరాజ్ అ న్నారు. అంబేడ్కర్ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వెబ్నార్ వేదికగా నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో భాగమైన ఆఽధునిక లఘు కవిత్వ ప్రక్రియలపై పృథ్వీరాజ్ మాట్లాడారు. వార్త సేకరణ, రచన అనే అంశంపై ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం విభాగం విభాగాధిపతి ప్రొఫెసర్ బాబీవర్థన్ బుధవారం ప్రసంగిస్తారు. కార్యక్రమంలో అంబేడ్కర్ వర్సిటీ వీసీ కూన రాంజీ, రిజిస్ట్రార్ కె.రఘుబాబు, ప్రిన్సిపాల్ టి.కామరాజు, తెలుగు శాఖ కోఆర్డినేటర్ పొందల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు