‘కరోనా’ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2020-05-31T08:59:21+05:30 IST

ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ జట్ల పర్యటనలో ‘కరోనా వైరస్‌’ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతివ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కు ఇంగ్లండ్‌...

‘కరోనా’ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతివ్వండి

ఐసీసీకి ఈసీబీ విజ్ఞప్తి

లండన్‌: ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ జట్ల పర్యటనలో ‘కరోనా వైరస్‌’ సబ్‌స్టిట్యూట్‌కు అనుమతివ్వాలని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం క్రికెట్‌లో కాంకషన్‌ ఆటగాళ్ల స్థానంలో మాత్రమే మరో ఆటగాడిని తీసుకోవడానికి ఐసీసీ అనుమతిస్తోంది. అయితే విండీస్‌, పాక్‌తో టెస్ట్‌ సిరీ్‌సల్లో మైదానంలో ఆటగాళ్లు గాయపడినా, అస్వస్థతకు గురైనా సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్లకు అనుమతించాలని ఈసీబీ కోరుతోంది. ఇప్పటికే కరోనాతో బంతిపై ఉమ్మిరాయడాన్ని ఐసీసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో తమ విజ్ఞప్తికి కూడా ఐసీసీ నుంచి సానుకూల స్పందన ఉంటుందని ఈసీబీ ఆశాభావంతో ఉంది. 

Updated Date - 2020-05-31T08:59:21+05:30 IST