అంతర్రాష్ట్ర వాహన దొంగలు అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-04T00:47:57+05:30 IST

జిల్లాలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను

అంతర్రాష్ట్ర  వాహన దొంగలు అరెస్ట్

చిత్తూరు: జిల్లాలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 11 మంది అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి జిల్లాలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కోటి రూపాయల విలువ గల 107 ద్విచక్ర వాహనాలను దొంగల నుంచి చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు యువకులు బానిసై ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-04T00:47:57+05:30 IST