టీఆర్‌ఎస్‌తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఇంటింటి ప్రచారంలో మంత్రి పువ్వాడ

ABN , First Publish Date - 2021-03-08T06:01:20+05:30 IST

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే సమగ్రాభివృద్ధి సాధ్యం.. ఇంటింటి ప్రచారంలో మంత్రి పువ్వాడ
ఖమ్మంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి పువ్వాడ

ఎమ్మెల్సీగా పల్లాను గెలిపించి సీఎంకు కానుకివ్వాలి 

ఖమ్మం కార్పొరేషన్‌, మార్చి 7: టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని 24, 37, 42, 44 డివిజన్లలో ఆయన ఇంటింటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరవాసులను, పట్టభద్రులను కలిసి పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని, సంక్షోభ సమయంలోనూ పథకాలు అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో నవ్వులపాలవుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఆయన 24వ డివిజన్‌లోని వీడీవోస్‌ కాలనీ సాయిబాబా ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, కార్పొరేటర్లు తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, నాయకులు తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్‌, పోట్ల శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-08T06:01:20+05:30 IST