రూ.28,900 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2021-07-31T06:33:05+05:30 IST
కొవిడ్ కష్టాలు ఉన్నా భవిష్యత్ వ్యాపార అవకాశాలపై టాటా మోటార్స్ అత్యంత ఆశాభావంతో ఉంది.
టాటా మోటార్స్
న్యూఢిల్లీ: కొవిడ్ కష్టాలు ఉన్నా భవిష్యత్ వ్యాపార అవకాశాలపై టాటా మోటార్స్ అత్యంత ఆశాభావంతో ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది రూ.19,800 కోట్లుగా ఉన్న మూలధన పెట్టుబడులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.28,900 కోట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇందులో రూ.3,000-3,500 కోట్లు టాటా మోటార్స్ కోసం, మిగతా మొత్తం జేఎల్ఆర్ కోసం ఖర్చు చేయాలని భావిస్తోంది. కంపెనీ ఏజీఎంలో చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయం ప్రకటించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల అభివృద్ధి కోసం కూడా పెట్టుబడులు పెట్టనున్నట్టు వెల్లడించారు. ఐఓసీ నుంచి 15 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ కార్లకు ఇప్పటికే ఆర్డర్ సంపాదించినట్టు తెలిపారు.