రైతుబీమా కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-08-15T09:35:15+05:30 IST

అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి జ్యోతిశ్రీ తెలిపారు

రైతుబీమా కోసం దరఖాస్తుల ఆహ్వానం

మంచాల: అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి జ్యోతిశ్రీ తెలిపారు. శుక్రవారం మంచాలలో విలేకరులతో మాట్లాడుతూ రైతుబీమా వివరాలను తెలిపారు. 1961 నుంచి 2002 మధ్యకాలంలో జన్మించిన రైతులందరూ ఈపథకానికి అర్హులని పేర్కొన్నారు. తాజాగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంచాల మండలంలో ఇటీవల 72మంది రైతులు మృతిచెందగా బాధిత కుటుంబాలకు ఒ క్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తంగా రూ.36 కోట్లను పంపిణీ చేసినట్లు వివరించారు.

Updated Date - 2020-08-15T09:35:15+05:30 IST