పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-07-16T10:52:27+05:30 IST
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డ్స్ 2020-21 ఏడాదికి అభ్యర్థుల ..
ఏలూరు స్పోర్ట్స్, జూలై 15 : రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డ్స్ 2020-21 ఏడాదికి అభ్యర్థుల ఎంపికలు నిమిత్తం ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా క్రీడా సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లల్లో అత్యంత ప్రతిభ కనబర్చి వాటికి సంబంధించిన పూర్తి నివేదికతో పాటు ధ్రువీకరణ పత్రాలను ఆగస్టు 15వ తేదీలోపు పీడీఎఫ్, వర్డ్ ఫార్మేట్స్లో ఝ్చుఽ్చజ్ఛటట. ట్చ్చఞః్చఞజౌఠి.జీుఽ మెయిల్ అడ్రస్కు పంపించవచ్చని, లేదా ఏలూరు కలె క్టరేట్ లోని జిల్లా క్రీడాసాధికార సంస్థ కార్యాలయం సెట్వెల్లో అందజేయాలన్నారు.