టోర్నమెంట్ చివర్లో ఐపీఎల్ ఆల్-స్టార్ మ్యాచ్
ABN , First Publish Date - 2020-02-21T22:25:36+05:30 IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్కి ముందు అన్ని జట్ల ఆటగాళ్లు రెండు జట్లగా ఏర్పడి.. ఆల్ స్టార్స్ మ్యాచ్ పేరిట ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్కి ముందు అన్ని జట్ల ఆటగాళ్లు రెండు జట్లగా ఏర్పడి.. ఆల్ స్టార్స్ మ్యాచ్ పేరిట ఛారిటీ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఆడే జట్లు ఇవే అంటూ సోషల్మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ మ్యాచ్ని రద్దు చేశారంటూ.. గత కొంతకాలంగా సోషల్మీడియాలో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్లను ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ తోసిపుచ్చారు. ఆల్ స్టార్ మ్యాచ్ రద్దు కాలేదని.. టోర్నమెంట్ చివరికి మ్యాచ్ వాయిదా వేశామని ఆయన అన్నారు.
ముంబై మిర్రర్ అనే పత్రిక ఆల్ స్టార్ మ్యాచ్ రద్దైంది అంటూ కథనాన్ని ప్రచూరించింది. ఈ మ్యాచ్లో ఫ్రాంచైజీల్లోని ప్రధాన ఆటగాళ్లకు గాయాలు అయితే.. టోర్నమెంట్లో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందన్న కారణంగా ఈ మ్యాచ్ని రద్దు చేశారని సదరు పత్రిక పేర్కొంది. అయితే ఈ వార్త అవాస్తవమని పటేల్ తెలిపారు.
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పటేల్ మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్ని రద్దు చేయలేదు. దాన్ని టోర్నమెంట్ చివరికి వాయిదా వేశామంతే. అందరు ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారో మేము గమనించాలి. దాని ఆధారంగానే ఆల్-స్టార్ మ్యాచ్ కోసం జట్లను సిద్ధం చేశాము.