ఐపీఎల్‌ బెట్టింగ్‌..ఆరుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-09-24T09:08:27+05:30 IST

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు...

ఐపీఎల్‌ బెట్టింగ్‌..ఆరుగురి అరెస్టు

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని బెంగళూరు సీసీబీ పోలీసులు బుధవారం తెల్లవారు జామున అరెస్టు చేశారు. ఐపీఎల్‌ పోటీలపై బెట్టింగ్‌ దందా చేస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతో బాణసవాడి, మల్లేశ్వరంలో దాడులు నిర్వహించినట్టు నగర క్రైమ్‌ విభాగ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. ఈ సందర్భంగా రెండు కేసులను నమోదు చేసి వీరి నుంచి మొబైల్‌ ఫోన్లు, రూ.6 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Updated Date - 2020-09-24T09:08:27+05:30 IST