కోల్‌కతాను చిత్తుగా ఓడించిన బెంగళూరు

ABN , First Publish Date - 2020-10-22T03:54:37+05:30 IST

అబుదాబి: ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తుగా ఓడించింది.

కోల్‌కతాను చిత్తుగా ఓడించిన బెంగళూరు

అబుదాబి: ఐపీఎల్‌ పోటీల్లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిత్తుగా ఓడించింది. 85 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా నెగ్గింది. గుర్‌కీరత్ సింగ్ మాన్ 21 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ 18, పడిక్కల్ 25, ఫించ్ 16 పరుగులు చేశారు. 



అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 84  పరుగులు మాత్రమే చేసింది.  కోల్‌కతాకు ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్ కీలక మ్యాచ్‌లో పెవిలియన్‌కు క్యూ కట్టారు. బెంగళూరు బౌలర్ సిరాజ్ బౌలింగ్‌లో కోల్‌కత్తా బ్యాట్స్‌మెన్స్ 3 వికెట్లను సమర్పించుకున్నారు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రాహుల్ త్రిపాఠి కీపర్ క్యాచ్‌గా డివిలియర్స్‌కు చిక్కి ఔటయ్యాడు. 5 బంతులు ఆడిన రాహుల్ త్రిపాఠి ఒక్క పరుగు మాత్రమే చేశాడు.


Updated Date - 2020-10-22T03:54:37+05:30 IST