ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ సగానికి కోత

ABN , First Publish Date - 2020-03-05T09:50:40+05:30 IST

కాసులు కురిపించే ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకొంది. ఖర్చులు తగ్గించుకొనే చర్యల్లో భాగంగా ఈ నెల 29 నుంచి జరిగే 13వ ...

ఐపీఎల్‌  ప్రైజ్‌మనీ సగానికి కోత

విజేతకు రూ. 20 కోట్ల నుంచి 10 కోట్లకు తగ్గింపు

పొదుపు చర్యల్లో బీసీసీఐ

న్యూఢిల్లీ: కాసులు కురిపించే ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకొంది. ఖర్చులు తగ్గించుకొనే చర్యల్లో భాగంగా ఈ నెల 29 నుంచి జరిగే 13వ ఐపీఎల్‌ ప్రైజ్‌మనీని సగానికి కోత వేసింది. ఇదే విషయాన్ని ఫ్రాంచైజీలకు తెలియజేసింది. గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ అందించగా.. ఈ సీజన్‌లో రూ. 10 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. రన్నర్‌పగా నిలిచిన టీమ్‌కు రూ. 12.5 కోట్లకు బదులు రూ. 6.25 కోట్లు, క్వాలిఫయర్స్‌లో ఓడిన రెండు టీమ్‌లకు రూ. 4.3 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ‘ఫ్రాంచైజీలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. స్పాన్సర్‌షిప్స్‌, ఇతర విధానాల్లో వారికి భారీ ఆదాయం సమకూరుతోంద’ని బోర్డు వర్గాలు తెలిపాయి. 

ఫ్రాంచైజీల అసంతృప్తి 

ప్రైజ్‌మనీ మొత్తాన్ని భారీగా తగ్గించడంపై ఎనిమిది ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. నిర్ణయం తీసుకొనే ముందు కనీస సమాచారం కూడా అందించలేదని ఆరోపిస్తున్నాయి. 


Updated Date - 2020-03-05T09:50:40+05:30 IST