రాజస్థాన్కు షాకిచ్చిన నైట్రైడర్స్
ABN , First Publish Date - 2020-10-01T04:57:47+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా కోల్కత్తా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నైట్రైడర్స్ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయాన్ని ...
దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా కోల్కత్తా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో నైట్రైడర్స్ జట్టు 37 పరుగుల తేడాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో టోర్నీలో నైట్ రైడర్స్ టీమ్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లను కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. నైట్రైడర్స్ చేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పెవిలియన్కు క్యూ కట్టింది.
రాజస్థాన్ బ్యాటింగ్లో ఉన్న కీలక ఆటగాళ్లు.. బట్లర్ 21, కెప్టెన్ స్మిత్ 3, సంజూ సామ్ సన్ 8, ఊతప్ప 2,.. పరుగులకే పరిమితమయ్యారు. దీంతో అప్పటికే.. 41 పరుగులకే నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయి రాజస్థాన్ టీమ్ కష్టాల్లో కూరుకుపోయింది. రాయల్స్ జట్టులో టామ్ కుర్రాన్ 54, బట్లర్ 21 పరుగులు చేసి టాప్ స్కోర్లుగా నిలిచారు. నైట్ రైడర్స్ బౌలింగ్లో శివం మావి, కమలేశ్, చక్రవర్తికి తలా రెండు వికెట్లు దక్కగా, కమీన్స్, నరేన్, కుల్దీప్లు తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కత్తా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో శుభమన్ గిల్ 47, మోర్గాన్ 34, రస్సెల్ 24, నితీష్ రానా 22 పరుగులు చేశారు. రాయల్స్ బౌలింగ్లో అర్చర్ రెండు వికెట్లు తీయగా..రాజ్ పుత్, ఉనద్కత్, టామ్ కుర్రాన్, రాహుల్ తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.