కరోనా నుంచి కోలుకున్న కరుణ్ నాయర్

ABN , First Publish Date - 2020-08-13T23:14:30+05:30 IST

మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనాను జయించాడు. నాయర్ ఐపీఎల్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత నెల..

కరోనా నుంచి కోలుకున్న కరుణ్ నాయర్

న్యూఢిల్లీ: మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనాను జయించాడు. నాయర్ ఐపీఎల్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే గత నెల అతడికి కరోనా సోకినట్లు తేలింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో నాయర్ యూఏఈ చేరేందుకు సన్నద్ధమౌతున్నాడు. అయితే అంతకంటే ముందు మరో మూడుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ పరీక్షల్లో కూడా ఫలితం నెగిటివ్ వస్తేనే యూఏఈకి పంపుతామని చెప్పింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్ళ ఆరోగ్యంపై మరింత జాగ్రత్త వహిస్తోంది. అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు యూఏఈ చేరేందుకు సన్నద్ధమౌతున్నారు.

Updated Date - 2020-08-13T23:14:30+05:30 IST