ఐపీఎల్ జరిగి తీరాలి: హర్భజన్
ABN , First Publish Date - 2020-04-08T09:09:52+05:30 IST
ఖాళీ స్టేడియాల్లోనైనా ఫర్వాలేదు.. ఐపీఎల్ మాత్రం జరిగి తీరాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ‘ఎంతో మంది జీవితాలు ఐపీఎల్తో ముడిపడి ఉన్నాయి. అందుకే కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత లీగ్ను
ముంబై: ఖాళీ స్టేడియాల్లోనైనా ఫర్వాలేదు.. ఐపీఎల్ మాత్రం జరిగి తీరాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. ‘ఎంతో మంది జీవితాలు ఐపీఎల్తో ముడిపడి ఉన్నాయి. అందుకే కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత లీగ్ను నిర్వహించాలి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించ కపోతే ఖాళీ మైదానాల్లో ఆడడానికైనా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆటగాడిగా అది నాకు నిరుత్సాహాన్ని కలిగించేదే అయినా.. ఇళ్లల్లో ఉన్నవారు టీవీల్లో చూసే అవకాశం ఉంది’ అని భజ్జీ స్టార్స్ స్పోర్ట్స్తో చెప్పాడు.