ఎల్ఐసీ, జీఐసీలకే ఐఆర్డీఏఐ ఓటు
ABN , First Publish Date - 2020-09-26T06:43:03+05:30 IST
దేశంలో వ్యవస్థాత్మకంగా అత్యంత కీలకమైన బీమా కంపెనీలుగా (డీ-ఎ్సఐఐ) ఎల్ఐసీ, జీఐసీ, న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీలను నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది...
న్యూఢిల్లీ : దేశంలో వ్యవస్థాత్మకంగా అత్యంత కీలకమైన బీమా కంపెనీలుగా (డీ-ఎ్సఐఐ) ఎల్ఐసీ, జీఐసీ, న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీలను నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఈ కారణంగా ఈ మూడు కంపెనీలపై నియంత్రణాపరమైన పర్యవేక్షణ పెంచుతున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్ పాలన, రిస్క్ల గుర్తింపు, సమర్థవంతమైన రిస్క్ నిర్వహణ విధానం మూడింటిపై అధికంగా దృష్టి సారించాలని ఆ కంపెనీలను కోరింది.