సారాపై ఉక్కుపాదం

ABN , First Publish Date - 2021-12-08T05:22:38+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కర్ణాటక మద్యం, సారాపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూరింటెండెంట్‌ జి.మధుసూదన్‌ పేర్కొన్నారు.

సారాపై ఉక్కుపాదం
విలేకరులతో మాట్లాడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూపరింటెండెంట్‌ మధుసూదన్‌

వాల్మీకిపురం, డిసెంబరు 7: జిల్లా వ్యాప్తంగా కర్ణాటక మద్యం, సారాపై ఉక్కుపాదం మోపుతున్నామని జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సూరింటెండెంట్‌ జి.మధుసూదన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన వాల్మీకిపురం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ మదనపల్లె డివిజన్‌ పరిధిలో జూలై 1 నుంచి ఇప్పటిదాకా 1181 కేసులు నమోదు చేసి, 758 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. 13,478 లీటర్ల కర్ణాటక  మద్యం, 348 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. 8,150 లీటర్ల సారా సీజ్‌ చేసి 2,37,180 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.  అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరిం టెండెంట్‌ రాధాకృష్ణ, సీఐ శివసాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T05:22:38+05:30 IST