సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించారు: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2021-10-19T02:26:25+05:30 IST

అసమర్థ పాలనతో సాగునీటి రంగాన్ని సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో

సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించారు: దేవినేని ఉమా

అమరావతి: అసమర్థ పాలనతో సాగునీటి రంగాన్ని సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రణాళిక, ముందుచూపు లేకుండా ఇరిగేషన్‌ రంగాన్ని నాశనం చేశారన్నారు. 29 నెలల పాలనా కాలంలో జగన్‌ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారన్నారు. ఇరిగేషన్‌ మంత్రి అడ్రస్‌ లేకుండా పోయినా సీఎం జగన్‌ నోరు విప్పడన్నారు. 940 మెగా వాట్ల సామర్థ్యం ఏడాదికి 2 వేలకోట్ల ఆదాయాన్ని ఇచ్చే పవర్‌ ప్రాజెక్టును భ్రష్టు పట్టించారన్నారు. బహులార్థక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా మార్చివేశారని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-19T02:26:25+05:30 IST