రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ ఉద్యోగుల పాత్ర కీలకం : మంత్రి అనిల్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-01-21T06:19:50+05:30 IST

రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ కొనియాడారు.

రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ ఉద్యోగుల పాత్ర కీలకం : మంత్రి అనిల్‌కుమార్‌

రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ ఉద్యోగుల పాత్ర కీలకం : మంత్రి అనిల్‌కుమార్‌

విజయవాడ, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతిలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ కొనియాడారు. జలవనరుల శాఖ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర డైరీని మంత్రి విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును కచ్చితంగా పూర్తిచేస్తామన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఉద్యోగుల ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జలవనరుల శాఖ ఉద్యోగులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె.జలంధర్‌, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, డైరీ కమిటీ చైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి, జలవనరుల శాఖ ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-01-21T06:19:50+05:30 IST