ఎస్పీతో పొత్తుకు మరో పార్టీ సిద్ధం!

ABN , First Publish Date - 2021-11-23T23:39:14+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలే ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నప్పటికీ వాటి ప్రభావం అంతంత..

ఎస్పీతో పొత్తుకు మరో పార్టీ సిద్ధం!

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలే ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నప్పటికీ వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉండనుంది. ఇక ఇతర చిన్న పార్టీలు ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాని పార్టీల్లో ఒకటిగా ఉన్న సమాజ్‌వాది పార్టీతో సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ పొత్తు ఏర్పరుచుకుంది. కాగా మరోపార్టీ సైతం ఎస్పీతో జతకట్టేందుకు సిద్ధమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ దళ్ (ఆర్‌ఎల్‌డీ) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్‌తో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జయంత్ చౌదరితో కరచాలనం చేస్తున్న ఫొటోను అఖిలేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘మార్పు దిశగా జయంత్ చౌదరితో పాటు’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరనుందంటూ అంచనాలు వెలువడుతున్నాయి. ఇది వాస్తవం రూపం దాల్చితే త్వరలోనే ఎస్పీ, ఎస్‌బీఎస్పీలతో ఆర్‌ఎల్‌డీ పొత్తులో భాగం కానుంది.

Updated Date - 2021-11-23T23:39:14+05:30 IST