ఇదేనా భౌతికదూరం పాటించడమంటే...!
ABN , First Publish Date - 2021-05-24T06:08:31+05:30 IST
కరోనాతో వందలాదిమంది మృత్యువాత పడుతుంటే నీరుగట్టువారిపల్లెలో మాత్రం ప్రాణ భయం లేకుండా ఆదివారం ఉదయం 7 గంటలకే బస్టాండ్ ప్రాంతంలో చేపలు, కూరగాయలు, నాటుకోళ్ల కోసం పోటెత్తారు.
మదనపల్లె అర్బన్, మే 23: కరోనాతో వందలాదిమంది మృత్యువాత పడుతుంటే నీరుగట్టువారిపల్లెలో మాత్రం ప్రాణ భయం లేకుండా గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం 7 గంటలకే బస్టాండ్ ప్రాంతంలో చేపలు, కూరగాయలు, నాటుకోళ్ల కోసం పోటెత్తారు. పక్కనే టమోటా మార్కెట్ వద్ద పోలీసు అవుట్ పోస్టు ఉంది. ఇంత జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని నీరుగట్టువారిపల్లెలో భౌతికదూరం పాటించే విధంగా చూడాల్సి ఉంది. ఆదివారం కూడా కర్ఫ్యూను మధ్యాహ్నం 12 గంటలపైన అమలు చేశారు. వాహనాల రాకపోకలను కట్టడి చేశారు.