సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
ABN , First Publish Date - 2021-01-14T11:28:23+05:30 IST
సిరియాపై ఇజ్రాయెల్ చేసిన భీకర వైమానిక దాడు ల్లో 40 మంది చనిపోయారని సిరియా మానవ హక్కుల సంస్థ
బీరుట్, జనవరి 13: సిరియాపై ఇజ్రాయెల్ చేసిన భీకర వైమానిక దాడు ల్లో 40 మంది చనిపోయారని సిరియా మానవ హక్కుల సంస్థ పేర్కొంది. సైనిక స్థావరాలు, డిపోలను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ ఈ దాడులు చేసిందని ఆ సంస్థ వెల్లడించింది. మృతుల్లో 9 మంది సిరియన్ సైనికులు, 31 మంది విదేశీ సైనికులు ఉన్నారని తెలిపింది. 2018 జూన్ తర్వాత ఇజ్రాయెల్ చేసిన అత్యంత భీకరమైన దాడులు ఇవేనని వెల్లడించింది. ఇజ్రాయెల్ 18 కన్నా ఎక్కువ సార్లు వైమానిక దాడులు చేసింది.