యథేచ్చగా ఇసుక, మట్టి తరలింపు

ABN , First Publish Date - 2020-11-18T05:26:57+05:30 IST

పట్టించుకోని అధికారులు

యథేచ్చగా ఇసుక, మట్టి తరలింపు
నంబరు ప్లేట్‌ లేకుండా ఇసుక తరలిస్తున్న చిత్రం

వినుకొండటౌన్‌, నవంబరు 17 : వినుకొండలో ఉన్న మట్టికి, ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వైసీపీ సానుభూతిపరులు కొరతను సృష్టించి భవన నిర్మాణ యజమానుల నుంచి తీవ్రంగా దోచుకుంటున్నారు. మట్టి రకాన్ని బట్టి ట్రక్కుకు రూ.వెయ్యి చొప్పున వసూళ్లు చేస్తున్నారు. అక్రమమార్గాన ట్రాక్టర్లతో ఇసుక, మట్టిని పట్టణంలో యథేచ్ఛగా తోలి సొమ్ము చేసుకుంటున్నారు. వినుకొండలో సుమారు 100 ట్రాక్టర్లకు పైగా రాత్రి, పగలని తేడా లేకుండా నంబరు ప్లేట్లను తొలగించి ఇసుక ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. ఇటీవల కాలంలో వెంకుపాలెం, విఠంరాజుపల్లి మార్గాల ద్వారా మట్టిని రాత్రికి రాత్రి తరలిస్తున్నప్పటికీ ఆ ప్రాంతంలోని అధికారులు మిన్నకుండి పోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్గాన నడుస్తున్న వందలాది ట్రాక్టర్లను అరికట్టి భవన నిర్మాణ యజమానులకు మట్టి, ఇసుక, గలుగును అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. 


Updated Date - 2020-11-18T05:26:57+05:30 IST