వాళ్ల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ: ఈటల
ABN , First Publish Date - 2022-07-09T09:01:54+05:30 IST
స్వాతంత్య్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన వారిని ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
న్యూఢిల్లీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర ఉద్యమంలో త్యాగాలు చేసిన వారిని ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ‘జైహో’ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రారంభించారు. నాటి త్యాగధనుల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్నామని తెలిపారు. వారి ఆశయాలను, ఆలోచనలను రాబోయే తరాలకు తెలియజేయాలని సూచించారు.