అలాంటి విలువలున్న ఏకైక పార్టీ బీజేపీ: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-11-24T22:22:20+05:30 IST

ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. అయితే ప్రతి పార్టీలో అధినేతలు కుటుంబాల నుంచి వస్తారు. కానీ ఒక్క బీజేపీలో మాత్రమే కార్యకర్తల నుంచి నాయకుడు వస్తారు. సొంత తెలివి తేటలతోనే నాయకులు ఎదుగుతారు. అందుకే చెప్తున్నా...

అలాంటి విలువలున్న ఏకైక పార్టీ బీజేపీ: జేపీ నడ్డా

చెన్నై: ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తూ రాజకీయాలు చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఏ పార్టీలోనైనా వంశపారపర్యంగా నాయకులు, అధినేతలు వస్తాయని, ఒక్క బీజేలో మాత్రమే సొంత తెలివి తేటలతో ఎదుగుతారని ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం తమిళనాడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.


‘‘ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి. అయితే ప్రతి పార్టీలో అధినేతలు కుటుంబాల నుంచి వస్తారు. కానీ ఒక్క బీజేపీలో మాత్రమే కార్యకర్తల నుంచి నాయకుడు వస్తారు. సొంత తెలివి తేటలతోనే నాయకులు ఎదుగుతారు. అందుకే చెప్తున్నా.. ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువల్ని పాటిస్తూ రాజకీయాలు చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది పూర్తిగా సిద్ధాంతంపై నడిచే పార్టీ. జాతీయ ప్రయోజనాలు, మనోభావాలపై ఈ పార్టీకి పట్టింపు ఎక్కువగా ఉంటుంది. అలాగే మత విశ్వాస పరమైన అంశాలపై కూడా శ్రద్ధ ఉంటుంది’’ అని నడ్డా అన్నారు.

Updated Date - 2021-11-24T22:22:20+05:30 IST