మరో రెండు రోజులు వర్షాలు
ABN , First Publish Date - 2020-08-15T09:44:13+05:30 IST
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడే అవకాశం ..
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్ప పీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు వానలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.