ఈ ఏడాది ఐటీ వ్యయాల్లో 7.3 శాతం వృద్ధి

ABN , First Publish Date - 2021-04-08T06:04:54+05:30 IST

దేశంలో ఐటీ వ్యయాలు ఈ ఏడాది 7.3 శాతం పెరిగి 9300 కోట్ల డాలర్లకు (రూ.6.97 లక్షల కోట్లు) చేరవచ్చునని పరిశోధన సంస్థ గార్టనర్‌ అంచనా వేసింది

ఈ ఏడాది ఐటీ వ్యయాల్లో 7.3 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: దేశంలో ఐటీ వ్యయాలు ఈ ఏడాది 7.3 శాతం పెరిగి 9300 కోట్ల డాలర్లకు (రూ.6.97 లక్షల కోట్లు) చేరవచ్చునని పరిశోధన సంస్థ గార్టనర్‌ అంచనా వేసింది. అయినప్పటికీ ప్రపంచ సగటు వృద్ధి 8.4%(4.1 లక్షల కోట్ల డాలర్లు) కన్నా తక్కువేనని తెలిపింది. అయితే 2022లో ఇది 9850 కోట్ల డాలర్లకు (రూ.7.39 లక్షల కోట్లు) చేరవచ్చునని పేర్కొంది. రాబోయే కాలంలో ఐటీ వ్యయాలు కార్పొరేట్‌ మద్దతు కార్యకలాపాలకే కాకుండా వ్యాపార విలువ జోడింపు వ్యాపారాలకు కూడా విస్తరిస్తాయని తెలిపింది. విభాగాలవారీగా చూస్తే డేటా సెంటర్‌ సిస్టమ్స్‌ విభాగం 4.3ు (350 కోట్లడాలర్లు), ఎంటర్‌ప్రైజ్‌ సాఫ్ట్‌వేర్‌ విభాగం 13.3 శాతం (770 కోట్ల డాలర్లు), డివైస్‌లు 7.7ు (346 కోట్ల డాలర్లు), కమ్యూనికే షన్‌ సర్వీసులు 4.9 శాతం (301  కోట్ల డాలర్లు) వృద్ధిని నమోదు చేయవచ్చునని తెలిపింది. 

Updated Date - 2021-04-08T06:04:54+05:30 IST