ఆ కారణంతోనే టీడీపీ ముద్ర వేశారు: కావేరి భాయ్

ABN , First Publish Date - 2020-05-31T17:11:02+05:30 IST

తన కుమారుడుకి స్లో పాయిజన్ ఇస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని..

ఆ కారణంతోనే టీడీపీ ముద్ర వేశారు: కావేరి భాయ్

విశాఖ: తన కుమారుడుకి స్లో పాయిజన్ ఇస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని డాక్టర్ సుధాకర్‌ తల్లి కావేరి భాయ్ ఆరోపించారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేకపోయినా అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లి వచ్చారనే కారణంతో టీడీపీ ముద్ర వేశారని ఆరోపించారు. సీబీఐ విచారణతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. విశాఖలో దళిత సంఘాల ఐక్యత వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుధాకర్ తల్లి పాల్గొన్నారు. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె వేడుకున్నారు. కాగా డాక్టర్ రామిరెడ్డిపై ఆరోపణలు రావడంతో మహిళా డాక్టర్‌ను నియమించారు. మరోవైపు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

Updated Date - 2020-05-31T17:11:02+05:30 IST