ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్రజెండాయే
ABN , First Publish Date - 2021-12-01T06:56:37+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్ర జెండాయేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
గరిడేపల్లి రూరల్, నవంబరు 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేది ఎర్ర జెండాయేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని కట్టవారిగూడెంలో మంగళవారం నిర్వహించిన సీపీఎం మండల ఏడో మహాసభలో ఆయన మాట్లాడారు. పేదలకు సీపీఎం ఆండగా ఉంటుందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. పెట్టుబడిదారుల పాలన అంతం కావాలంటే ఎర్రజెండా అధికారం లోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, ధరావత్ రవినాయక్, నర్సింహారావు, మండల కార్యదర్శి షేక్ యాకుబ్, బోయిళ్ల నవీన్, అనంతు ప్రకాశ్, పాండు సైదులు, రామస్వామి, భిక్షం, వెంకటేశ్వర్లు, వెంకయ్య, గ్రామ కమిటీల కార్యదర్శులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.