వచ్చే నాలుగు రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2021-05-09T08:43:29+05:30 IST

దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదేవిధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది. వీటికితోడు రోజురోజుకూ వేసవి తీవ్రత పెరుగుతుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది

వచ్చే నాలుగు రోజులు వర్షాలు

అమరావతి/విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదేవిధంగా మధ్య భారతంలో మరో ఆవర్తనం ఉంది. వీటికితోడు రోజురోజుకూ వేసవి తీవ్రత పెరుగుతుండడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. బంగాళాఖాతం మీదుగా కోస్తా, రాయలసీమపైకి తేమతో కూడిన గాలులు వీస్తుండడంతో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కర్నూలులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రత నమోదయ్యింది. 

Updated Date - 2021-05-09T08:43:29+05:30 IST