పాక్ జట్టుపై మాజీ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్క మ్యాచ్ గెలిచినా అద్భుతమేనంటూ..

ABN , First Publish Date - 2020-07-13T03:56:06+05:30 IST

పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ టూర్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పాక్ జట్టుపై మాజీ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు.. ఒక్క మ్యాచ్ గెలిచినా అద్భుతమేనంటూ..

ఇస్లామాబాద్: పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్ టూర్‌పై పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ టూర్‌లో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా అద్భుతమేనని అతను అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌పై కనీసం ఒక్క మ్యాచ్ గెలవాలన్నా పాక్ జట్టుకు కష్టమేనని చెప్పాడు. ‘పాక్ జట్టులో అందరూ యువఆటగాళ్లే. వీళ్లు ఇంగ్లండ్‌లో ఒక్క మ్యాచ్ గెలిచినా అద్భుతమే’ అని అజ్మల్ చెప్పాడు. ఇంగ్లండ్ టూర్‌లో పాకిస్తాన్ 5 టెస్టులు, 5 టీ20లు ఆడనుంది. తొలి టెస్టు ఆగస్టు 5న ప్రారంభంకానుంది.

Updated Date - 2020-07-13T03:56:06+05:30 IST