తాలిబన్ల చెర నుంచి 62 మంది భారతీయులకు విముక్తి: కీలకపాత్ర పోషించిన తెలుగు జవాన్లు

ABN , First Publish Date - 2021-08-19T18:23:32+05:30 IST

కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులకు...

తాలిబన్ల చెర నుంచి 62 మంది భారతీయులకు విముక్తి: కీలకపాత్ర పోషించిన తెలుగు జవాన్లు

న్యూఢిల్లీ: కాందహార్‌లో చిక్కుకున్న 62 మంది భారతీయులకు తాలిబన్ల నుంచి విముక్తి లభించింది. ఐటీబీపీ కమాండోలు వారిని క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. భారతీయులను తాలిబన్ల చెర నుంచి విడిపించడంలో తెలుగు జవాన్లు కీలక పాత్ర పోషించడం విశేషం. ఐటీబీపీ కమాండోలు సురేష్‌, రాజశేఖర్‌, కేపీ రెడ్డి.. తాలిబన్లతో చర్చించి వారిని ఒప్పించి.. 62మంది భారతీయులను క్షేమంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి వారు ఇండియాకు విమానంలో రానున్నారు. ఇదిలావుండగా తుపాకులు చేతబట్టిన తాలిబన్లు రాజధాని కాబుల్‌లో గుంపులుగా తిరుగుతుండటంతో అఫ్గాన్‌ ప్రజలతోపాటు విదేశీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ  నేపధ్యంలో కాబుల్‌లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 


Updated Date - 2021-08-19T18:23:32+05:30 IST