8 వేల కుటుంబాలకు ఐటీడీఏ చేయూత
ABN , First Publish Date - 2020-05-23T10:18:34+05:30 IST
ఉమ్మడి జిల్లాలోని కొలాం, తోటి గిరిజనులకు చెందిన ఎనిమిది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు
ఉట్నూర్, మే 22: ఉమ్మడి జిల్లాలోని కొలాం, తోటి గిరిజనులకు చెందిన ఎనిమిది వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్మిశ్రా తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎందా రాముగూడలో కొలాం గిరిజనులకు చెందిన 60 కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా నిత్యావసర సరుకులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఐటీడీఏ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొలాం తోటి గిరిజనులకు సరుకులను అందిస్తున్నామన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మిగిలిపోయిన ఆహార వస్తువులను సైతం పంపిణీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సీసీడీపీ నిధులను మంజూరు చేసిన వెంటనే గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు.
రానున్న వర్షాకాలంలో కూడా ప్రజలందరు కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ చందనసర్పే, ఎంపీపీ పంద్రజైవంత్రావు, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, సర్పంచ్ సురేఖ, గ్రామ పటేల్ శేషారావు, అజిమొద్దీన్, సింగారేభరత్, దాసండ్ల ప్రభాకర్, జూవ్వాద్ అన్సారీ, ధరణీ రాజేష్ పాల్గొన్నారు.