సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరం: ఐవైఆర్ కృష్ణారావు

ABN , First Publish Date - 2021-10-19T18:22:03+05:30 IST

విజయవాడ: ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మండిపడ్డారు.

సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరం: ఐవైఆర్ కృష్ణారావు

విజయవాడ: ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తోందన్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఆలస్యంగా వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలు కూడా లేని పరిస్థితి ఉందన్నారు. విశాఖలోని భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితిని చూస్తున్నామని, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి సామర్ధ్యం ఉన్న నాయకుడు లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రం నెత్తిమీద ఉన్న అప్పును ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అప్పు తేవడం.. పంచడమే పనిగా పెట్టుకున్నారని ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

Updated Date - 2021-10-19T18:22:03+05:30 IST