ఇజ్రాయెల్ సహకారంతో ‘ఉత్కృష్ట గ్రామాలు’!
ABN , First Publish Date - 2022-01-29T08:33:11+05:30 IST
దేశంలో 12 రాష్ట్రాలకు చెందిన దాదాపు 150 గ్రామాలను ఇజ్రాయెల్ సహకారంతో ‘ఉత్కృష్ట గ్రామాలు’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ...
12 రాష్ట్రాలకు చెందిన 150 గ్రామాల ఎంపిక
న్యూఢిల్లీ, జనవరి 28: దేశంలో 12 రాష్ట్రాలకు చెందిన దాదాపు 150 గ్రామాలను ఇజ్రాయెల్ సహకారంతో ‘ఉత్కృష్ట గ్రామాలు’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రభుత్వం, సదరు రాష్ట్రాల్లోని పన్నెండింటిని ఉత్కృష్ట కేంద్రాలుగా తీర్చిదిద్దింది. ఆ ప్రాంతాల్లో ఏడాదికి 2.8 కోట్ల కూరగాయల మొక్కలను, 3.87 లక్షల నాణ్యమైన పండ్ల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే ఏటా 1.2లక్షల మంది రైతుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు. భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా తొలి ఏడాది 75 గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇందులో భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 27న ఇజ్రాయెల్ రాయబారితో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు.