భారత సైన్యానికి చేరిన ఇజ్రాయెల్‌ డ్రోన్లు

ABN , First Publish Date - 2021-12-01T08:17:16+05:30 IST

సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై నిఘాకు భారత సైన్యం అమ్ముల పొదిలో ఇజ్రాయెల్‌ డ్రోన్లు చేరాయి....

భారత సైన్యానికి చేరిన ఇజ్రాయెల్‌ డ్రోన్లు

న్యూఢిల్లీ, నవంబరు 30: సరిహద్దుల్లో తరచూ కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాపై నిఘాకు భారత సైన్యం అమ్ముల పొదిలో ఇజ్రాయెల్‌ డ్రోన్లు చేరాయి. హెరాన్‌ మానవ రహిత డ్రోన్లు అత్యాధునిక సాంకేతికతతో సరిహద్దుల్లో నిఘా పెడతాయి. ఇప్పటికే భారత సైన్యం వద్ద హెరాన్‌ డ్రోన్లు అందుబాటులో ఉన్నా.. తాజాగా సరఫరా చేసిన వాటిలో యాంటీ-జామింగ్‌ వంటి పలు అధునాతన సదుపాయాలున్నాయి. భారత సైన్యం వద్ద ఇప్పటికే ఉన్న పలు డ్రోన్లను రూ.500 కోట్ల అత్యవసర ఆర్థిక నిధులతో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా.. సుదీర్ఘ సరిహద్దు భద్రతకు మరిన్ని చిన్న/మధ్య తరహా నిఘా డ్రోన్లను దేశీయ సంస్థల నుంచి కొనుగోలు చేయడానికి సన్నద్ధమవుతోంది.

Updated Date - 2021-12-01T08:17:16+05:30 IST