జే ట్యాక్స్‌... లేదంటే జేసీబీలు

ABN , First Publish Date - 2021-04-19T09:59:02+05:30 IST

‘జగన్‌ రెడ్డి పాలనలో జే ట్యాక్స్‌ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా పేదలకు

జే ట్యాక్స్‌... లేదంటే జేసీబీలు

అమరావతి, ఏప్రిల్‌ 18: ‘‘జగన్‌ రెడ్డి పాలనలో జే ట్యాక్స్‌ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని సర్కారుకు నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారు?’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో 120 ఇళ్ళను జేసీబీల సాయంతో అధికారులు ఆదివారం కూల్చివేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని ఆరోపించారు. బాధితుల తరఫున టీడీపీ న్యాయ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. బాధితులను కలిసి మాట్లాడాలని నియోజకవర్గ టీడీపీ నేతలకు లోకేశ్‌ ఫోన్‌ చేశారు.

Updated Date - 2021-04-19T09:59:02+05:30 IST