పీఆర్సీపై ముఖ్యమంత్రితో తేల్చుకుంటాం: రాజేందర్

ABN , First Publish Date - 2021-01-27T21:58:10+05:30 IST

పీఆర్సీపై ముఖ్యమంత్రితోనే తేల్చుకుంటామని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ రాజేందర్ తెలిపారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. కాసేపట్లో సీఎస్‌తో

పీఆర్సీపై ముఖ్యమంత్రితో తేల్చుకుంటాం: రాజేందర్

హైదరాబాద్: పీఆర్సీపై ముఖ్యమంత్రితోనే తేల్చుకుంటామని ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ రాజేందర్ తెలిపారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. కాసేపట్లో సీఎస్‌తో సమావేశం కానున్నట్లు చెప్పారు. ‘పీఆర్సీపై ముఖ్యమంత్రి రాజకీయ నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం ఉంది. పీఆర్సీ నివేదికతో మాకు సంబంధం లేదు. సీఎస్ చెప్పేది వినటానికి మాత్రమే వెళ్తున్నాం. మా నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి చెప్తాం. పీఆర్సీ రికమండేషన్స్ నక్కకు.. నాగ లోకానికి ఉన్న తేడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 7.5శాతం ఫిట్‌మెంట్‌ను అంగీకరించం. ఉపాధ్యాయ సంఘాలు మాపై అనవసర ఆరోపణలు చేయటం సరికాదు. పీఆర్సీ మాకు మాత్రమే కాదు.. ఉపాధ్యాయులకు కూడా వస్తోంది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో ముందుకు వెళ్తేనే ఫలితం ఉంటోంది’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2021-01-27T21:58:10+05:30 IST